విశాఖ ఉక్కు కోసం..సత్యాగ్రహం

విశాఖ ఉక్కు కోసం..సత్యాగ్రహం

సత్యా రెడ్డి నటిస్తూ, దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘సత్యాగ్రహం’. పల్సర్ బైక్ ఝాన్సీ ఫిమేల్ లీడ్‌గా నటించింది. శుక్రవారం ఈ మూవీ సాంగ్స్‌‌,  ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి  దర్శకుడు త్రినాథరావు నక్కిన, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, గద్దర్ కుమార్తె  వెన్నెల,  ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ హాజరై టీమ్‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. 

సత్యారెడ్డి మాట్లాడుతూ ‘ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం గద్దర్ గారు. ఆయనతో నాకున్న అనుబంధం మర్చిపోలేనిది. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబంధించిన సమస్యలపై ఈ సినిమా తీశాం’ అని చెప్పారు.