
2022–2023 సీజన్ రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు తలపడనున్నాయి. ఇండోర్లో జరిగిన తొలి సెమీస్ లో 306 పరుగుల తేడాతో బెంగాల్ జట్టు మధ్యప్రదేశ్ ని ఓడించి ఫైనల్ చేరింది. రెండో సెమీ ఫైనల్ లో సౌరాష్ట్ర కర్ణాటకను నాలుగు పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ లో అడుగుపెట్టింది. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర ఫైనల్ చేరడం ఇది ఎనిమిదవసారి. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో ఫైనల్ జరగనుంది