సావర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కొత్త ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సావర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కొత్త ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఫండ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ సావర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ నెల 26 న తన మొదటి పోర్టుఫోలియో మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పీఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫండ్ ‘యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రా ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ను లాంచ్ చేయనుంది. ఏఐ సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కంపెనీలను ఎనాలసిస్ చేస్తామని, ఇందుకోసం ‘ఎపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే టెక్నాలజీని డెవలప్ చేశామని కంపెనీ ఫౌండర్ శంకర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చందా అన్నారు. యాడ్ ఆస్ట్రా ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనీసం రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు. ‘రెండు ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫీజు వసూలు చేస్తాం. మొదటి ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఏడాదికి 2 శాతం ఫీజు వేస్తాం. ఏడాదిలో  నిఫ్టీ 50 కంటే ఎంత ఎక్కువ  ప్రాఫిట్ వస్తే అంత అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 శాతం వసూలు చేస్తాం. రెండో ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 4 శాతం ఫీజు వేస్తాం’ అని వివరించారు.

ఇప్పటికే రూ.25–30 కోట్లు వచ్చాయని, లాంచింగ్ రోజు మరో రూ.30 కోట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సుమారు 12–14 షేర్లలో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని అన్నారు. షేర్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తామని, కొంత డెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెడతామని వివరించారు. సుమారు 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కాలానికి గాను షేర్లలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు.  2019 లో స్టార్ట్ అయిన తమ కంపెనీ ప్రస్తుతం రూ.2,100 కోట్లను మేనేజ్ చేస్తోందని పేర్కొన్నారు.