
గద్వాల/పెబ్బేరు, వెలుగు : పేకాట స్థావరంపై ఎస్బీ, వనపర్తి పోలీసులు దాడి చేసి 16 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.6.36 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాస్రావు తెలిపారు. గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నది అవతలి వైపు ఉన్న రంగాపూర్ శివారులోని ఓ గోదామ్లో పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం దాడి చేసినట్లు పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ సీఐ నాగేశ్వర్ రెడ్డి, ఇటిక్యాల ఎస్ఐ వెంకటేశ్తో పాటు వనపర్తి జిల్లాకు చెందిన పోలీసుల ఆధ్వర్యంలో దాడి చేశామని, నగదుతో పాటు 4 కార్లు, 4 బైక్స్, 15 మొబైల్స్ స్వాధీనం చేసుకొని పెబ్బేరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించినట్లు తెలిపారు.