SBI డెబిట్ కార్టు ఛార్జీలు పెరిగాయ్..ఏప్రిల్ 1 నుంచి అమలు

SBI డెబిట్ కార్టు ఛార్జీలు పెరిగాయ్..ఏప్రిల్ 1 నుంచి అమలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)  కొన్ని డెబిట్ కార్టులకు సంబంధించిన నిర్వహణ ఛార్జీలను పెంచింది. SBI  యువ, గోల్డ్, కాంబో , ప్లాటినం,క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్  డెబిట్ కార్డుల ఛార్జీలు పెరగనున్నాయి. పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

సవరించబడిన SBi డెబిట్ కార్టు ఛార్జీలు 

క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణకు ప్రస్తుత ఉన్న రూ.125 నుంచి 200+GST
యువా, గోల్డ్,కాంబో డెబిట్ కార్డ్ , మైకార్డ్(ఇమేజ్ కార్డ్) వంటి డెబిట్ కార్డుల ఇయర్ మెయింటెనెన్స్  ఛార్జీలు  ప్రస్తుతం రూ. 175 ఉండగా.. రూ.250కి పెరగనున్నాయి. 
SBI ప్లాటినం డెబిట్ కార్డ్ కోసం వార్షిక నిర్వహణ ఛార్జీలు రూ.325 కి పెరగనున్నాయి. ప్రస్తుత ఛార్జీలు రూ. 175లు. 
ప్రైడ్ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డు వంటి SBI డెబిట్ కార్డులకు సంవత్సరానికి మెయింటెనెన్స్ ఛార్జీలు రూ.425 కు పెరగనున్నాయి. ప్రస్తుతం ఛార్జీలు రూ. 350