
న్యూఢిల్లీ: యెస్ బ్యాంక్లోని తన వాటాల్లో 13.18 శాతం సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్ఎంబీసీ) కు రూ.8,888.97 కోట్లకు ఎస్బీఐ అమ్మింది. ఇతర బ్యాంకులూ యెస్ బ్యాంక్లోని తమ వాటాలను ఎస్ఎంసీబీ అమ్మాయి.
ఇది భారత బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద క్రాస్-బోర్డర్ ఇన్వెస్ట్మెంట్. ఈ అమ్మకం తర్వాత యెస్ బ్యాంక్లో ఎస్బీఐ వాటా 10.8 శాతానికి తగ్గుతుంది.
ఇదిలా ఉంటే, ఎస్ఎంబీసీ యెస్ బ్యాంక్లో ఎస్బీఐ నుంచి మరింత ఎక్కువ వాటాను కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉన్నట్టు ప్రకటించింది.