అసెంబ్లీ సీట్ల పెంపు పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ

అసెంబ్లీ సీట్ల పెంపు పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించిన దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణ, ఏపీలో సీట్ల పెంపునకు సంబంధించి పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపును 119 నుంచి 153కు, ఏపీలో 175 నుంచి 225కు పెంచాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని నిబంధనలు అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అంశాన్ని పురుషోత్తం రెడ్డి పిటిషన్ లో ప్రస్తావించారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్రం, ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.