
సినీ నటుడు విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్నారు. హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గిరిజన సంఘాల ఫిర్యాదుతో విజయ్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్లో చేసిన కామెంట్స్ తమను కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు ఫిర్యాదు చేశాయి. ‘‘పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే, ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయి" అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
2025, ఏప్రిల్ నెలలో హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా విజయ్ చేసిన వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.