క్రెడిట్‌‌‌‌ కార్డ్ అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేస్తామని అకౌంట్‌‌‌‌ ఖాళీ

క్రెడిట్‌‌‌‌ కార్డ్ అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేస్తామని అకౌంట్‌‌‌‌ ఖాళీ
  •     సెల్‌‌‌‌ నంబర్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ చేసి ఐదు విడతలుగా డబ్బులు  డ్రా చేసిన సైబర్‌‌‌‌ నేరగాళ్లు
  •     రూ.2.63 లక్షలు  మోసపోయిన రైతు

వనపర్తి/రేవల్లి, వెలుగు : కారు అమ్మగా వచ్చిన డబ్బుతో ట్రాక్టర్‌‌‌‌ లోన్‌‌‌‌ కట్టాలని అనుకున్న ఓ రైతు సైబర్‌‌‌‌ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ఫోన్‌‌‌‌ నంబర్‌‌‌‌ను బ్లాక్‌‌‌‌ చేసి, సెల్‌‌‌‌కు మెసేజ్‌‌‌‌లు రాకుండా చేసిన సైబర్‌‌‌‌ నేరగాళ్లు ఐదు విడతలుగా రూ. 2.63 లక్షలు కాజేశారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం గౌరిదేవిపల్లి గ్రామానికి చెందిన కొరుపాల విజయ్‌‌‌‌కి గత నెల 25న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌‌‌‌ చేసి క్రెడిట్‌‌‌‌ కార్డు అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేస్తాం.. ఫోన్‌‌‌‌ నంబర్‌‌‌‌కు వచ్చిన ఓటీపీ చెప్పాలని అడగడంతో విజయ్‌‌‌‌ నంబర్‌‌‌‌ చెప్పి ఫోన్‌‌‌‌ పెట్టేశాడు. 

ఆ మరుసటి రోజే అతడి అకౌంట్‌‌‌‌ నుంచి రూ. 13 వేలు కట్‌‌‌‌ అయ్యాయి. తర్వాత తన కారు అమ్మగా వచ్చిన రూ. 2.50 లక్షలను జూన్‌‌‌‌ 29న నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ మహారాష్ట్ర బ్యాంక్‌‌‌‌లోని తన అకౌంట్‌‌‌‌లో డిపాజిట్‌‌‌‌ చేశాడు. తర్వాత జులై 1న విజయ్‌‌‌‌ సెల్‌‌‌‌నంబర్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ కావడంతో నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌ అనుకొని వదిలేశాడు.  ట్రాక్టర్‌‌‌‌ లోన్‌‌‌‌కు సంబంధించిన ఈఎంఐ కట్టాల్సి ఉండడంతో ఈ నెల 16న ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించగా అకౌంట్‌‌‌‌లో జీరో చూపించింది.

 దీంతో ఆందోళనకు గురైన విజయ్‌‌‌‌ వెంటనే స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ చెక్‌‌‌‌ చేయగా ఈ నెల 1, 3, 8, 13 తేదీల్లో డబ్బులు డెజిట్‌‌‌‌ అయినట్లు తేలింది. దీంతో వెంటనే 1930కి కాల్‌‌‌‌ చేసి ఫిర్యాదు చేశాడు.