
కోదాడ, వెలుగు: పదో తరగతి స్టూడెంట్లలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించేందుకు స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహించినట్లు క్రినిధి ఫౌండేషన్ నిర్వాహకులు, ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేశ్ చౌదరి తెలిపారు. కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్ లో గల ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ ఆవరణలో క్రినిధి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం పదో తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్టులో సుమారు 950 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజేశ్ చౌదరి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని స్టూడెంట్లలో ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి అవసరమైన ప్రోత్సాహం అందించి వారిని జాతీయ స్థాయి ర్యాంకర్లుగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్కాలర్ షిప్ టెస్ట్ లో పాల్గొన్న వారిలో విద్యార్థి, విద్యార్థులలో మొదటి ఐదుగురికి మొత్తం పది మందికి ప్రైజులు అందించారు.
ఈ టెస్ట్ లో బాలికల విభాగంలో షేక్ మానా ఫస్ట్ ప్రైజ్, షేక్ సమీరా సెకండ్ ప్రైజ్ సాధించగా బాలుర విభాగంలో వి.శశాంక్ ఫస్ట్ ప్రైజ్, బి. పరశురామ్ సెకండ్ ప్రైజ్ సాధించారు. వీరికి కాలేజ్ చైర్మన్ రాజేశ్ చౌదరి ప్రైజ్లను అందజేశారు. డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరెస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ జి. వెంకటరమణ, అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య, వైస్ ప్రిన్సిపాల్ పి. ఎన్. ఆర్. క్యాంపస్ ఇన్చార్జులు మౌనిక, ప్రవీణ్, పీఆర్ఓ మల్లికార్జున రావు, లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.