పిల్లల పేరెంట్స్ అలర్ట్ అవ్వండి... స్కూల్ బస్సులతో జాగ్రత్త..!

పిల్లల పేరెంట్స్ అలర్ట్ అవ్వండి... స్కూల్ బస్సులతో జాగ్రత్త..!

ఇల్లు గడవాలంటే భార్య, భర్త ఇద్దరు పని చేయక తప్పనిసరి అయిన నేటి కాలంలో పిల్లలను దగ్గరుండి స్కూల్ కి తీసుకెళ్లటం అసాధ్యమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక స్కూల్ బస్సుల మీద ఆధారపడుతున్నారు అందరూ. ఆటోలు, టాక్సీలు వంటి వాటిల్లో పంపటం అంత సేఫ్ కాదని భావించి స్కూల్ బస్సులనే ప్రిఫర్ చేస్తుంటాం. అలాంటి స్కూల్ బస్సులే మన పిల్లల ప్రాణం తీసినంత పని చేస్తే మన పరిస్థితి ఏంటి? ముంబైలో జరిగిన సంఘటన చుస్తే ఇలాగే అనిపిస్తుంది.

 

ముంబైకి దగ్గరలో ఉన్న వసై ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఇద్దరు చిన్నారులను స్కూల్ బస్సు తొక్కుకుంటూ వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. పెద్దలు ఎవరూ లేకుండా ఇద్దరు చిన్నారులు రోడ్ దాటుతున్న సమయంలో అటు నుండి వస్తున్న స్కూల్ బస్సు వారిని తొక్కుకుంటూ వెళ్ళింది. ఈ ఘటనలో చిన్నారులిద్దరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయట పడ్డారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఈ యాక్సిడెంట్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.