
తెలంగాణలో సెప్టెంబర్ 15వ తేదీన టీఎస్ టెట్ 2023(TS TET 2023) పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించిన స్కూళ్లకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. రేపు(సెప్టెంబర్ 14) హాఫ్ డే, పరీక్ష జరిగే రోజు సెప్టెంబర్ 15న పూర్తిగా సెలవు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు టెట్ పరీక్ష హాల్ టికెట్లను ఇప్పటికే అధికారిక వెబ్సైట్ https://tstet.cgg.gov.in/ లో అందుబాటులో ఉంచారు. సెప్టెంబర్ 15న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది పేపర్-1కు 1,139 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. టెట్ పరీక్షకు హైదరాబాద్లో అత్యధికంగా 92, అతి తక్కువగా ములుగు జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-2 పరీక్షకు 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి టెట్ పేపర్-1కు 2,69,557 దరఖాస్తులు.. పేపర్-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి.
టెట్ దరఖాస్తుల్లో తప్పులుంటే పరీక్ష రోజు సవరించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇన్విజిలెటర్ను సంప్రదించి తప్పుగా నమోదైన వివరాలను నామినల్ రోల్స్లో సవరించుకోవచ్చని సూచించారు. ఈ విషయాన్ని అభ్యర్థుల హాల్టికెట్ లో కూడా పొందుపరిచారు.
ఈసారి కూడా టెట్ సిలబస్లో ఎటువంటి మార్పు లేదు. పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్-1 సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకానికి, పేపర్-1 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు.
Also Read :- బంగాళాఖాతంలో అల్పపీడనం : తూర్పు, ఉత్తర తెలంగాణలో వర్షాలు
ఏ సబ్జెక్ట్కు ఎన్ని మార్కులంటే..?
టెట్ పరీక్షలో మొత్తం 150 మార్కులకు గాను.. చైల్డ్ డెవలప్మెంట్ 30 మార్కులు, సాధారణ తెలుగు( మూడో తరగతి నుంచి 10 తరగతి వరకు ఉన్న తెలుగు) 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు వ్యాకరణం, గ్రామర్పై దృష్టిపెట్టాలి. మిగిలిన 60 మార్కులే చాలా ముఖ్యం.. తెలుగు మెథడాలజీ 12 మార్కులు, మిగిలిన 48 మార్కులు తెలుగు సాహిత్యం, ఆధునిక ధోరణీ, టెక్ట్స్ బుక్స్లో ఉన్నవన్నీ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.