అక్టోబర్ 26 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్

అక్టోబర్ 26 నుంచి  స్కూళ్లు,  కాలేజీలు రీఓపెన్

హైరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యాసంస్థలకు ఇచ్చిన బతుకమ్మ, దసరా పండుగ సెలవులు ముగిశాయి. దీంతో గురువారం రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. ఈ నెల13 నుంచి స్కూళ్లకు, 19 నుంచి ఇంటర్ కాలేజీలకు సర్కారు సెలవులు ఇచ్చింది. బుధవారంతో సెలవులు పూర్తవడంతో అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.