జర్నీ టెన్షన్ ఫ్రీ: దసరాకు 620 స్పెషల్ రైళ్లు

జర్నీ టెన్షన్ ఫ్రీ: దసరాకు 620 స్పెషల్ రైళ్లు

హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తెలంగాణ, ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలనుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక సర్వీసులను నడపనుంది. అక్టోబర్ పండగ నెల కావడంతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైళ్లను నడపడానికి అన్ని ఏర్పాటు చేసింది. 

సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లితో సహా జంట నగరాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుండి రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.  పండుగల సీజన్‌లో విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంతో సహా వివిధ ఇతర ప్రాంతాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే.