- తృటిలో తప్పించుకున్న చిన్నారి
- తుక్కు తుక్కైన ఆటో, 4 బైక్లు
- వికారాబాద్ జిల్లాలో ప్రమాదం
పరిగి, వెలుగు: స్క్రాప్ డీసీఎం స్పీడ్ గా వెళ్తూ అదుపు తప్పి బోల్తా పడడంతో ఆటోతో పాటు బైక్లు తుక్కుతుక్కయ్యాయి. అయితే, ఘటన జరిగినప్పుడు ఓ చికెన్ సెంటర్ ముందు నిలబడిన చిన్నారి త్రుటిలో ప్రాణాలు దక్కించుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్పరిధిలోని బహార్పేట్ వీరభద్ర కిరాణ షాపు వద్ద ఆదివారం ఉదయం ఘటన జరిగింది. స్క్రాప్ డీసీఎం ( ఏపీ 22 టీఏ 5004) ఓవర్స్పీడ్తో కొడంగల్ చౌరస్తా నుంచి హైదరాబాద్ వైపు వస్తోంది.
బహార్పేట్ లిమ్రా హోటల్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో డీసీఎంలోని స్క్రాప్ అంతా పార్క్ చేసిన ఆటోతో పాటు 4 బైక్ లపై పడిపోయింది. పక్కనే చికెన్షాపు ఎదుట నిలబడిన చిన్నారిని తప్పిస్తూ వెళ్లగా జాలి ఆమెపై కూడా పడిపోగా.. స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. ఘటన సీసీ టీవీ కెమెరాలో రికార్డైంది. ప్రమాదం జరిగిన తర్వాత డీసీఎం డ్రైవర్ను బయటికి తీశారు. డ్రైవర్ మద్యం తాగి స్పీడ్ గా నడపడంతోనే ప్రమాదం జరిగిందని తెలిసింది. ఫైర్, పోలీసులు క్రేన్ సాయంతో స్క్రాప్ ను తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. డీసీఎం డ్రైవర్పై కేసు నమోదు చేసినట్టు పరిగి ఎస్ఐ మోహన్ కృష్ణ తెలిపారు.
