వికారాబాద్, వెలుగు: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 16 గ్రామాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. కోట్పల్లి మండలంలోని బార్వాద్ తండా, బుగ్గాపూర్, కంకణాలపల్లి, లింగంపల్లి, రాంపూర్, మోమిన్పేట మండలంలో అమ్రాదికుర్దు, చిన్న కోలుకుంద, చీమల్దరి, మక్తా తండా, ధరూర్ మండలంలో అవుసుపల్లి, నాగ్సాన్పల్లి, పీసీఎం తండా, మర్పల్లి మండలంలో మొగిలిగుండ్ల, నర్సాపూర్ పెద్ద తండా, నవాబుపేట మండలంలో మైతాబ్ఖాన్గూడ, నాగిరెడ్డిపల్లి సర్పంచ్స్థానాలు ఏకగ్రీయ్యాయని పేర్కొన్నారు. వికారాబాద్ మండలంలోని అత్వెల్లిలో వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా.. సర్పంచ్ స్థానానికి ఎన్నికలు జరుగుతాయన్నారు. మొదటి విడతలో 37 సర్పంచ్స్థానాలు కలుపుకొని మొత్తం 53 జీపీలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు.
348 పీవోలకు షోకాజ్ నోటీస్
రంగారెడ్డి కలెక్టరేట్ : జిల్లాలోని కొత్తూర్, నందిగామ, కేశంపేట్, కొందుర్గ్, జిల్లెడ్ చౌదర్ గూడ, ఫరూక్ నగర్, శంషాబాద్ మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం మొత్తం 1,989 మంది అధికారులను పీవోలుగా నియమించి, వారికి రెండోసారి ఈ నెల 6న ట్రైనింగ్ ఇచ్చారు. ఈ శిక్షణకు హాజరు కాని 348 పీవోలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్నారాయణరెడ్డి షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
