తెలంగాణలో అదుపులోకి సెకండ్ వేవ్ 

తెలంగాణలో అదుపులోకి సెకండ్ వేవ్ 

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తెలంగాణలో అదుపులోనే ఉందన్నారు రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కు కొరత లేకుండా  తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1.25 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశామని చెప్పారు. 

కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ.. ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కును కచ్చితంగా ధరించాలని సూచించారు. జనసమూహాలతో కూడిన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పారు.

మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో వైద్యారోగ్య శాఖ అన్నిరకాలుగా సిద్ధమయ్యిందన్నారు.ముందస్తు జాగ్రత్తగా 25 వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉంచామన్నారు. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలకు కొరత లేదని.. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోందన్నారు శ్రీనివాసరావు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏ జిల్లాలో కూడా కొత్తగా మలేరియా కేసులు నమోదు కాలేదని తెలిపారు.