సెక్యులరిజం పేరుతో ముస్లింలను అణగదొక్కుతున్నారు 

సెక్యులరిజం పేరుతో ముస్లింలను అణగదొక్కుతున్నారు 

మైనార్టీలను అణగదొక్కడానికి సెక్యులరిజంను కొందరు అవకాశవాదులు వాడుకుంటున్నారని ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లిం కమ్యూనిటీ వెనుకబాటుతనానికి కాంగ్రెస్‌‌తోపాటు బీజేపీ బాధ్యత వహించాలన్నారు. ‘బీజేపీ సెక్యులరిజం అంటే భయాలను సృష్టిస్తోంది. కాంగ్రెస్ అయితే సెక్యులరిజంపై లేనిపోని ఆశలను కల్పిస్తోంది. కానీ సెక్యులరిజంను కాపాడే బాధ్యతను మాత్రం ముస్లింల మీదకు నెడుతున్నారు. ఇలాంటి సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు ముస్లిం కమ్యూనిటీ నేతలను స్వేచ్ఛగా ఎదగనివ్వరని ముస్లిం ప్రజలు గ్రహించారు’ అని ఒవైసీ చెప్పారు.