ప్రైవేటు బస్సులో 2 కిలోల బంగారం స్వాధీనం

ప్రైవేటు బస్సులో 2 కిలోల బంగారం స్వాధీనం
  • రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు

అమరావతి: ప్రైవేటు బస్సు తనిఖీ చేసిన పోలీసులకు 2 కిలోల అక్రమ బంగారం పట్టుపడింది. ఎలాంటి రశీదులు లేకుండా ఈ బంగారు ఆభరణాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి పోలీసులు సీజ్ చేశారు. కృష్ణా జిల్లా ఉంగటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద జరిగిందీ ఘటన. ఆదివారం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు హైవేపై తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సును తనిఖీ చేయగా ఓ వ్యక్తి వద్ద బ్యాగులో 2 కిలోల బంగారు ఆభరణాలు దొరికాయి. బంగారం తీసుకెళ్తున్న వ్యక్తి హైదరబాద్ వాసి సాహిల్ గా గుర్తించి ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలిచ్చాడు. అవతలి వారితో ఫోన్లో మాట్లాడించినా సరైన సమాధానం రాలేదు. దీంతో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారు ఆభరణాలుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. 2కిలోల బంగారు ఆభరణాలకు  సంబంధించి ఎలాంటి ధృవపత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేశారు.