
జీడిమెట్ల, వెలుగు : ఇద్దరు స్టూడెంట్ల వద్ద డ్రగ్స్ దొరికిన ఘటన జగద్గిరిగుట్ట పరిధిలో జరిగింది. మాదాపూర్ఎస్ వోటీ , జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన ప్రకారం.. ఉత్తరాఖండ్కి చెందిన తిలక్శివ(22) జగద్గిరిగుట్ట పరిధి షిరిడి హిల్స్లో ఉంటూ కొంపల్లిలోని శివశివాని కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. విజయవాడకు చెందిన జూలపల్లి అశిల్శివ గోపన్పల్లి పరిధి తెల్లాపూర్లో ఉంటూ అలగప్ప యూనివర్సిటీలో బీబీఏ 3వ ఏడాది చదువుతున్నాడు.
సమాచారం మేరకు జగద్గిరిగుట్ట సీఐ బాలకృష్ణ వెళ్లి హైస్కూల్ వద్ద ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద 3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 45 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా విజయవాడకు చెందిన రోహిత్ సిటీకి వచ్చి డ్రగ్సప్లయ్ చేశాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.