టీ20ల్లో రాహుల్‌‌‌‌పై వేటు!

టీ20ల్లో రాహుల్‌‌‌‌పై వేటు!

న్యూఢిల్లీ: పదవీకాలం ముగిసిదిగిపోతున్న చేతన్‌‌‌‌‌‌‌‌ శర్మ నేతృత్వంలోని ఆలిండియా సీనియర్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ కమిటీనే శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌‌‌‌లకు జట్లను ఎంపిక చేయనుంది. జనవరి 3న లంకతో టీ20 సిరీస్‌‌‌‌ ఆరంభం కానుంది. మరో వారంలో కొత్త సెలక్షన్‌‌‌‌ కమిటీని నియమించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో చేతన్‌‌‌‌ అండ్‌‌‌‌ కో.. లంకతో సిరీస్‌‌‌‌లకు జట్లను సెలెక్ట్‌‌‌‌ చేస్తుందని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఇక, ఫామ్‌‌‌‌ కోల్పోయిన కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ను టీ20 టీమ్‌‌‌‌ నుంచి తప్పించే అవకాశం ఉండగా, గాయం నుంచి కోలుకోని రోహిత్‌‌‌‌ శర్మ, సీనియర్‌‌‌‌ కోహ్లీకి రెస్ట్‌‌‌‌ లభించొచ్చు. హార్దిక్‌‌‌‌కు టీ20 కెప్టెన్సీ అప్పగించడం లాంఛనమే కానుంది.