లాక్డౌన్తో ఇన్నాళ్లూ అందరికీ ఇల్లే అన్నీ. షాపింగులు లేవు.. సరదా షికార్లు లేవు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. కరోనాతో కలిసి బతకాల్సిందేనని పీఎం, సీఎం చెబుతున్నరు. ఈ పరిస్థితుల్లోనే పూర్తి స్థాయిలో దాదాపు అన్నింటినీ తెరుస్తున్నరు. దీంతో ఎవరికి వారు సెల్ఫ్ లాక్డౌన్ను పాటించడ మొక్కటే రక్షణ కవచం.
- మరీ అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు.
- చాలా మంది ఫ్రెండ్స్తో కలిసి సరదా కోసం బయటకు వెళుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిది.
ఏదైనా వస్తువు కొనాలనుకుంటే తప్ప షాపింగ్మాల్స్కు వెళ్లకపోతేనే మనకు, పక్కవాళ్లకు మంచిది. వీకెండ్ వస్తే చాలా మంది రెస్టారెంట్ ఫుడ్వైపే చూస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత వరకు రెస్టారెంట్లకు దూరంగా ఉండాలి. ఎలాగూ ఈ లాక్డౌన్ టైంలో చాలా మంది వంట ట్రయల్స్ చేసి చేతులు కాల్చుకునే ఉంటారు కదా. కాబట్టి, ఇప్పుడూ అదే ఫాలో అయితే బాగుంటుంది. ఇంటి తిండికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతగా తినాలనిపిస్తే డైన్ఇన్ కాకుండా టేక్అవే (పార్సిళ్లు) తీసుకుని ఇంటి దగ్గర తింటే ఇంకా బెటర్. కరోనాతో ఇన్నాళ్లూ గుళ్లు, ప్రార్థనా మందిరాలు క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు అవీ తెరుచుకుంటున్నాయి. అయితే, అక్కడికి ఎక్కువ మంది వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి గుడికి వెళితే దేవుడికి దండం పెట్టుకుని వీలైనంత తొందరగా ఇంటికి వచ్చేయాలి. దేవుడి దర్శనం తర్వాత చాలా మంది కాసేపు గుళ్లో కూర్చుని వస్తుంటారు. ఈ టైంలో దానిని అవాయిడ్ చేయాలి.