అయ్యో.. గణేశా..! రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడేసి వెళ్లారు...

అయ్యో.. గణేశా..! రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడేసి వెళ్లారు...

పద్మారావునగర్, వెలుగు: గణేశ్ ఉత్సవాల సందర్బంగా ఇటీవల ఎర్రగడ్డలో పలువురు విగ్రహాలను విక్రయించారు. అమ్ముడుపోగా, మిగిలిన వాటిని అక్కడే రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడేసి వెళ్లారు. 

దీనిని గమనించిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సనత్ నగర్ సభ్యులు.. సోమవారం డీసీఎం వ్యాన్​లో సుమారు 15 విగ్రహాలను సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్​లోని బేబీ వాటర్ పాండ్, మూసాపేట ఐడీఎల్ చెరువులో సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఎన్. సతీశ్, సాయి ప్రకాశ్, రణ్ వీర్, బవేశ్ పటేల్, కార్తీక్​ పాల్గొన్నారు.