గంజాయి అమ్ముతున్న నలుగురు అరెస్ట్

గంజాయి అమ్ముతున్న నలుగురు అరెస్ట్

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకం జోరుగా సాగుతోంది. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గంజాయి అమ్ముతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఒక కిలో బరువు కలిగిన 82 గంజాయి ప్యాకెట్లు, రెండు సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఘట్ కేసర్ మండలం ఔషాపూర్ గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  వారిపేర్లు సనాథన్ నాయక్, అమర్ పండిత్, సుబోధ్ లుమర్ పండిత్, మనోజ్ పండిత్ గా తెలిపారు. వారివద్ద నుంచి ఒక కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.