
హైదరాబాద్, వెలుగు: సెమీ ఇండియా, సెమీకండక్టర్ మిషన్ సంయుక్తంగా నిర్వహించనున్న సెమీకాన్ ఇండియా 2025 కార్యక్రమానికి విజిటర్స్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఈ సదస్సు, ఎగ్జిబిషన్ 2025 సెప్టెంబర్ 2 నుండి 4వ తేదీ వరకు ఢిల్లీలోని యశోభూమి ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ (ఐఐసీసీ) లో జరగనుంది.
"బిల్డింగ్ ది నెక్స్ట్ సెమీకండక్టర్ పవర్హౌస్" అనే థీమ్తో జరుగుతున్న ఈ ఈవెంట్, మైక్రోఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ వాల్యూ చెయిన్లో భారతదేశ సామర్థ్యాలను ప్రదర్శించనుంది. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ డిజైన్, తయారీ ఎకోసిస్టమ్లోని నిపుణులను, పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఆసక్తి గల వారు సెమీకాన్ ఇండియా 2025 వెబ్సైట్ ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు.