కొన్ని మీడియాలు బీఆర్​ఎస్​కు వత్తాసు పలుకుతున్నయ్: మురళీధర్ రావు

కొన్ని మీడియాలు  బీఆర్​ఎస్​కు వత్తాసు పలుకుతున్నయ్: మురళీధర్ రావు

హైదరాబాద్, వెలుగు: కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నాయని బీజేపీ సీనియర్​నేత, ఆ పార్టీ మధ్య ప్రదేశ్ ఇన్​చార్జ్​ మురళీధర్ రావు ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడు తుండడంతో ఓ వర్గం మీడియా తీరు చెలిమెలో చేపలు పడుతున్నట్లుగా ఉందని ఫైర్ అయ్యారు. తాను మాట్లాడుతున్న మాటలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 
 మోదీ వ్యతిరేకులు, పెట్టుబడిదారులకు దగ్గరగా ఉండే ఓ వర్గం మీడియా.. కాంగ్రెస్ ను బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నదని, కానీ అది సాధ్యం కాదని అన్నారు. యువకులు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేది యువకులేనని ఆయన అన్నారు. కేసీఆర్ వైఫల్యాలపై దృష్టి పెడితే ఆయన్ను ఓడించడం చాలా ఈజీ అన్నారు. 
ఇప్పటికే బీజేపీ డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్యపై పోరాటం మొదటు పెట్టిందని చెప్పారు. 2014, 2018 లో కాంగ్రెస్ ను ప్రతిపక్షంగా భావించి ప్రజలు ఓటు వేశారని, కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని విమర్శించారు.