తెలంగాణలో సైకో సీరియల్ కిల్లర్ రామస్వామి.. 5 హత్యలు ఎలా చేశాడో తెలుసా.. !

తెలంగాణలో సైకో సీరియల్ కిల్లర్ రామస్వామి.. 5 హత్యలు ఎలా చేశాడో తెలుసా.. !

వాడు కనిపించేంత మంచోడు అస్సలు కాదు.. వాడు మాటలు అన్నీ అబద్దాలు.. వాడి కన్ను పడిందంటే చాలు ఫినిష్.. ఒకరు ఇద్దరు కాదు.. ఇప్పటి వరకు ఐదు హత్యలు చేశాడు.. తెలంగాణలో సైకో సీరియల్ కిల్లర్ బాబు అలియాస్ రామస్వామి.. వికారాబాద్ అడవుల్లో జరిగిన మహిళ హత్య.. రామస్వామి బండారం బయటపడింది.. విచారిస్తే.. ఒకటి తర్వాత ఒకటి బయటపడింది.. అసలు రామస్వామి మహిళలను ఎలా చంపుతాడు.. ఎందుకు చంపుతున్నాడు అనేది చూద్దాం...

ఒంటరి మహిళలే టార్గెట్ :

ఒంటరిగా ఉంటున్న మహిళలను టార్గెట్ చేస్తాడు. భర్త నుంచి విడిపోయిన వారిని.. పెళ్లి కాకుండా ఉన్న వారిని.. భర్త చనిపోయి ఆసరా కోసం చూస్తున్న మహిళలను గుర్తిస్తాడు. ఆ తర్వాత వారితో మాటలు కలుపుతాడు.. ప్రేమగా మాట్లాడతాడు.. నేను కూడా ఒంటరినే.. తోడు కోసం అన్నట్లు చెబుతాడు.. నమ్మిస్తాడు.. ఆ తర్వాత సహ జీవనం అంటాడు.. కొన్నాళ్లు కాపురం చేసిన తర్వాత.. ఆ మహిళను చంపేస్తాడు. ఆమె దగ్గర ఉన్న డబ్బు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను తీసుకుని పారిపోతాడు. ఇలా ఇప్పటి వరకు ఐదుగురు మహిళలను చంపినట్లు చెబుతున్నారు పోలీసులు.

వికారాబాద్ హత్యతో వెలుగులోకి :

వికారాబాద్ లో జరిగిన ఓ మహిళ హత్యతో రామస్వామి కథంతా వెలుగులోకి వచ్చింది.  వికారాబాద్‌ జిల్లాలోని  చేవెళ్లకు చెందిన అనసూయ అనే మహిళతో రామస్వామి అక్రమ సంబధం పెట్టుకున్నాడు.  కొన్నిరోజుల పాటు ఆ మహిళతో బాగానే ఉన్నాడు. పాపం రామస్వామిని అనసూయ కూడా పూర్తిగా నమ్మేసింది. కొన్ని రోజులు తరువాత అలా బయటకు వెళ్దామని అనసూయను ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన రామస్వామి  ప్లాన్ లో భాగంగా  ఆమె మెడకు కొంగు బిగించి చంపేశాడు. 

ఆ తరువాత అనసూయను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలని పెట్రోల్ పోసి తగులబెట్టాడు.  కానీ పాపం ఏదోక రోజు పండాల్సిందే కదా.. అనసూయ హత్యతో రామస్వామి దొరికిపోయాడు. అసలు ఎవరీతనని పోలీసులు డెప్త్ గా రీసెర్చ్ చేస్తే  మనోడు పెద్ద సైకో సీరియల్ కిల్లర్ అని గతంలో  ఇదే తరహాలో5  హత్యలు చేసినట్లుగా గుర్తించారు. ఒక మహిళది అయితే తల నరికి... తల, మొండెం వేర్వేరు గా పాతిపెట్టినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం రామస్వామిని మరింతగా విచారిస్తున్నారు పోలీసులు.