సెన్సెక్స్, నిఫ్టీ .. ఆల్​ టైం హై!

సెన్సెక్స్, నిఫ్టీ .. ఆల్​ టైం హై!

ముంబై: ఈక్విటీ బెంచ్‌‌మార్క్ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీలు గురువారం రికార్డు తాజా గరిష్టాలను తాకాయి.  బీఎస్‌‌ఈ సెన్సెక్స్ 350.81 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి 74,227.63 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇండెక్స్ గరిష్టంగా 74,501.73 స్థాయి,  కనిష్ట స్థాయి 73,485.12 మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ కూడా 80 పాయింట్లు లాభపడి 22,514.65 వద్ద తాజా గరిష్ట స్థాయిని తాకింది.

50 షేర్ల బెంచ్‌‌మార్క్‌‌లో 31 షేర్లు లాభాలతో ముగిశాయి. గత రెండు సెషన్లలో రెండు సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. గత నెల ఏడో తేదీన సెన్సెక్స్ దాని మునుపటి గరిష్ట స్థాయి 74,119.39ని నమోదు చేసింది. నిఫ్టీ దాని మునుపటి గరిష్ట స్థాయి 22,493.55కి చేరుకుంది. ఆర్​బీఐ వడ్డీరేట్లను మార్చబోదనే నమ్మకం, పీఎంఐ పెరగడం, క్యూ4 ఫలితాలు బాగుంటాయనే అంచనాల కారణంగా మార్కెట్లు పుంజుకున్నాయని ఎనలిస్టులు తెలిపారు.

సెన్సెక్స్‌‌లో 20 స్టాక్‌‌లు గ్రీన్‌‌లో ముగిశాయి, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా,  ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, మారుతీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌‌సర్వ్‌‌లు లాభపడ్డాయి.  అయితే, ఎస్‌‌బీఐ, భారతీ ఎయిర్‌‌టెల్, జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్, పవర్‌‌గ్రిడ్, ఐటీసీ,  రిలయన్స్ ట్రేడింగ్‌‌ను నష్టాలతో ముగించాయి. ఆసియాలో సియోల్,  టోక్యో లాభాలతో ముగియగా, హాంకాంగ్,  షాంఘై మార్కెట్లు సెలవు కారణంగా పనిచేయలేదు. యూరోపియన్ మార్కెట్లు గ్రీన్‌‌లో ట్రేడవుతున్నాయి. బుధవారం సెషన్‌‌ను అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగించాయి.