
ముంబై: చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో బెంచ్మార్క్ ఇండెక్స్లు సోమవారం సెషన్ను నష్టాల్లో ముగించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, మారుతి షేర్లు పడడంతో సెన్సెక్స్ 354 పాయింట్లు (0.49 శాతం) తగ్గి 71,731 దగ్గర సెటిలయ్యింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 72,386 వరకు పెరిగింది. నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 21,771 దగ్గర క్లోజయ్యింది.
సోమవారం ఫ్లాట్గా ఓపెన్ అయిన బెంచ్మార్క్ ఇండెక్స్లు ఇంట్రాడేలో రేంజ్బౌండ్లో కదిలాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. చివరి గంటలో నష్టపోయాయని చెప్పారు. ఎఫ్ఎంసీజీ, టెలికం, ఫైనాన్షియల్స్, ఐటీ షేర్లు ఇండెక్స్లను కిందకి లాగాయని, ఫార్మా, ఆటో, ఎనర్జీ షేర్ల నుంచి సపోర్ట్ లభించిందని అన్నారు. యూఎస్ బాండ్ ఈల్డ్ 4 శాతం దాటిందని, దీంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. క్రూడాయిల్ ధరలు కూడా తగ్గడంతో మార్కెట్కు కొంత సపోర్ట్ లభిస్తోందని చెప్పారు.
సెన్సెక్స్లో టాటా మోటార్స్ టాప్ గెయినర్గా నిలిచింది. టాటా మోటార్స్ నికర లాభం క్యూ3 లో రెండింతలు (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగి రూ.7,100 కోట్లకు చేరుకోవడంతో కంపెనీ షేర్లు సోమవారం 6 శాతం ర్యాలీ చేశాయి. సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టీసీఎస్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, మారుతి బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్, టైటాన్ షేర్లు ఎక్కువగా పడ్డాయి.