దలాల్ స్ట్రీట్ లో వరుసగా రెండో రోజు బుల్ జోరు కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్ పై బడ్జెట్ సానుకూల ప్రభావాన్ని చూపించింది. మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పెంచడంతోపాటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ లో పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రైవేటు పెట్టుబడులను మరింత ప్రోత్సహించేలా బడ్జెట్ లో ప్రోత్సాహకాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ , నిఫ్టీ భారీగా లాభపడ్డాయి. బడ్జెట్ ఇచ్చిన ఉత్సాహంతో భారతీయ షేర్లు ఉరకలు వేస్తున్నాయి.
మరిన్ని వార్తల కోసం