Vikramarkudu 2: రవితేజ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ సిద్ధం.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Vikramarkudu 2: రవితేజ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ సిద్ధం.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

మాస్ మహారాజ రవితేజ(RaviTeja) కెరీర్ బెస్ట్ సినిమాల్లో టాప్ 3 లిస్టులో ఖచ్చితంగా ఉండే సినిమా విక్రమార్కుడు(Vikramarkudu). దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో రవితేజ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపక్క అత్తిలి సత్తిబాబుగా కడుపుబ్బా నవ్విస్తూనే.. మరోపక్క విక్రమ్ రాథోడ్ గా అద్భుతమైన హీరోయిజాన్ని పలికించాడు. ఇక ఈ సినిమా చూసిన ఆడియన్స్, మరీ ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ పిచ్చ.. పిచ్చగా ఎంజాయ్ చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకానొక సందర్భంలో ఈ సినిమాకు కథ అందించిన రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. విక్రమార్కుడు సినిమాను అన్ని లాంగ్వేజ్ లో రీమేక్ చేశారు కానీ, తెలుగులో రవితేజ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను ఎవరు క్రియేట్ చేయలేకపోయారు అనడం మామూలు విషయం కాదు. 

ఇదిలా ఉంటే.. చాలా కాలంగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుండి అనే వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. నిజానికి ఆడియన్స్ కూడా ఈ సినిమా సీక్వెల్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో మరోసారి విక్రమార్కుడు సీక్వెల్స్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది కారణం.. తాజాగా విక్రమార్కుడు సీక్వెల్ పై నిర్మాత రాధామోహన్ కామెంట్స్. తాజాగా ఆయన నిర్మాతగా వస్తున్న సినిమా భీమా. మాచోస్టార్ గోపీచంద్ హీరోగా వస్తున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా శివరాత్రి కానుకగా మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే భీమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఆన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చిత్ర నిర్మాత కేకే రాధామోహన్. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ విక్రమార్కుడు సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.. విక్రమార్కుడు సినిమా సీక్వెల్ కథ సిద్ధంగా ఉంది. కానీ, రవితేజ గారు నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ విషయంలో ఆయన్ని ఒప్పించే ప్రయత్నంలోనే మా టీమ్ ఉంది. ఇక సీక్వెల్ కథ కూడా విజయేంద్ర ప్రసాద్ గారే అందిస్తున్నారు. రవితేజ గారు ఒప్పుకున్నా వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.. అంటూ చెప్పుకొచ్చారు రాధామోహన్.

ALSO READ :- సీఎం రేవంత్ నువ్వు మగాడివైతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకో: కేటీఆర్

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ కు సంపత్ నంది దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ న్యూస్ తెలుసుకున్న రవితేజ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఈగల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ.. ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ చేస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రైడ్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.