హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుకేత్ ఖాద్ వద్ద ఓ ప్యాసింజర్ వెహికిల్ అదుపు తప్పి వంతెన పై నుంచి లోయలో పడిపోయింది . ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.
ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు చండీగర్ -మనాలి నేషనల్ హైవే మండి సమీపంలో పుల్ఘ్రత్ ప్రాంతంలో వంతెన పై నుంచి లోయలో పడింది. సమాచారం తెలుసుకున్న వెంటనే సదర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి వినోద్ కుమార్ ఠాకూర్ తో పాటు మొత్తం బృందం సంఘటన స్థలానికి చేరుకుని లోయలో పడ్డ వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీసింది. గాయాలైన డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన వారంతా బీహార్కు చెందిన కార్మికులుగా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మండల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలో లక్షా 30 వేలు దాటిన కరోనా మరణాలు
పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య
తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
Himachal Pradesh: Seven killed, one injured after a vehicle fell down in Suketi Khad water stream near Pullghrat area of Mandi district at around 3 am today pic.twitter.com/aGXB40GXny
— ANI (@ANI) November 16, 2020