సూర్యలంక బీచ్ లో ఏడుగురు విద్యార్థులు గల్లంతు

సూర్యలంక బీచ్ లో ఏడుగురు విద్యార్థులు గల్లంతు


ఏపీ బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ లో విషాదం చోటుచేసుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని గజ ఈతగాళ్లు కాపాడారు. మూడు మృతదేహాలు దొరికాయి..మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ కు చెందిన విద్యార్థులు స్నానానికి బీచ్ లోపలికి వెళ్లి గల్లంతయ్యారు. మృతులు సింగ్ నగర్ కు చెందిన సిద్దు, అభి, సాయిలుగా పోలీసులు గుర్తించారు .