
మహే: సీషెల్స్ నేషనల్ డే బాక్సింగ్ చాంపియన్షిప్లో ఆరుగురు ఇండియన్ బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారు. ఆదివారం జరిగిన 65 కేజీల మూడో రౌండ్లో ఆదిత్య ప్రతాప్ ఆర్ఎస్సీ ద్వారా జొవానీ బౌజిన్ (సీషెల్స్)పై నెగ్గాడు. 75 కేజీల రెండో రౌండ్లో నీరజ్ ఆర్ఎస్సీ ద్వారానే తమ ప్రత్యర్థిపై గెలిచాడు. హిమాన్షు శర్మ (50 కేజీ) 4–1తో మాథ్యూ సూప్రేన్ (మారిషస్)ను ఓడించాడు. 55 కేజీల బౌట్లో ఆశిష్ ముద్షానియా 4–1తో గిల్లౌమ్ ఫ్రాన్సిస్ (మారిషస్)పై, 60 కేజీల్లో అన్మోల్ 4–1తో డారియో గాబ్రియెల్ (సీషెల్స్)పై గెలుపొందారు. 90+ కేజీల విభాగంలో గౌరవ్ చౌహాన్ డైరెక్ట్గా ఫైనల్స్కు అర్హత సాధించాడు. 70 కేజీల కేటగిరీలో కార్తీక్ దలాల్ 1-4తో బ్లెసింగ్ నజియానా (సౌతాఫ్రికా) చేతిలో ఓడాడు.