
మహే: సీషెల్స్ నేషనల్ డే బాక్సింగ్ టోర్నీలో ఇండియన్ బాక్సర్ల పంచ్ అదిరింది. మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఏడు పతకాలతో టాప్ ప్లేస్ను సాధించారు. మెన్స్ 50 కేజీ బౌట్లో హిమాన్షు శర్మ వాకోవర్ విజయంతో గోల్డ్ మెడల్ను సొంతం చేసుకున్నాడు. 55 కేజీ ఫైనల్లో ఆశీష్ ముద్షానియా 4–1తో తన ప్రత్యర్థిపై విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన 90+ కేజీ టైటిల్ ఫైట్లో గౌరవ్ చౌహాన్ 3–2తో నెగ్గాడు. అన్మోల్ (60 కేజీ), ఆదిత్య యాదవ్ (65 కేజీ), నీరజ్ (75 కేజీ) ఫైనల్లో 2–3 తేడాతో తమ ప్రత్యర్థుల చేతిలో ఓడి సిల్వర్ మెడల్స్తో సంతృప్తి పడ్డారు. 70 కేజీ కేటగిరీలో కార్తీక్ దలాల్కు కాంస్య పతకం లభించింది.