
- హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ నాయకుల ధర్నా
హైదరాబాద్, వెలుగు : పెండింగ్స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. యూనియన్నాయకులతో కలిసి గురువారం ఉదయం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. ఆరేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్లకు ఫీజులు చెల్లించడం లేదని మండిపడ్డారు. ఏటా రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది స్కాలర్ షిప్కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని, అందరికీ కలిపి రూ.3వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.8,214.57 కోట్లు పెండింగ్పెట్టిందని వాపోయారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. అకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకుని అర్హులను గుర్తించాలని కోరారు. అర్హులకు ముందుగా 25 శాతం ఫీజు రియంబర్స్మెంట్చెల్లించాలని డిమాండ్చేశారు. తర్వాత మిగిలిన మొత్తం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, జిల్లా నాయకులు సునీల్, చరణ్య, విఘ్నేశ్, అజయ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.