నేను పాల్గొంటే చరిత్ర అవుతుందని తెలియదు.. కానీ, ఆ క్షణం పారిపోవాలనిపించింది: షారుక్‌ ఖాన్‌

నేను పాల్గొంటే చరిత్ర అవుతుందని తెలియదు.. కానీ, ఆ క్షణం పారిపోవాలనిపించింది: షారుక్‌ ఖాన్‌

ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే మెట్‌‌ గాలా ఈవెంట్‌‌ కోసం ఫ్యాషన్‌‌ ప్రపంచమంతా ఎంతగానో ఎదురుచూస్తుంటుంది. న్యూయార్క్‌‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌‌లోని కాస్ట్యూమ్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ దీన్ని నిర్వహిస్తుంది. ఫ్యాషన్ ప్రపంచానికి ఇదొక అతి పెద్ద పండుగ.

ఈ ఏడాది మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్‌‌లో వివిధ దేశాలకు చెందిన సినీతారలు, సింగర్స్, మోడల్స్ అబ్బురపరిచే ఫ్యాషన్ లుక్స్ లో బ్లూ కార్పెట్ పై మెరిశారు. మన దేశం నుంచి బాలీవుడ్‌‌ బాద్‌‌ షా షారుక్‌‌ ఖాన్‌‌.. బ్లాక్‌‌ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్స్‌‌లో డిఫరెంట్‌‌ జ్యువెలరీతో మోడ్రన్‌‌ కింగ్‌‌ గెటప్‌‌లో హాజరయ్యాడు. ఇక ఈ వేడుకలకు హాజరైన తొలి భారతీయ నటుడిగా షారుక్‌ ఖాన్‌( Shah Rukh Khan)చరిత్ర సృష్టించారు. 

Also Read : చూపులతోనే చంపేస్తున్న కుమారి

షారుఖ్ స్పందిస్తూ.. ‘‘ఈ ఏడాది మెట్‌ గాలాకి ఆహ్వానం అందగానే నా కుమారుడు ఆర్యన్, కుమార్తె సుహానా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ వేడుకలో నేను పాల్గొంటే అది చరిత్ర అవుతుందని కూడా నాకు తెలియదు. నేను ఇప్పటివరకు రెడ్‌ కార్పెట్‌పై నడవలేదు. నాకు ఫ్యాషన్‌పై ఆసక్తి కూడా తక్కువ. దీంతో ఈ వేడుకకు రావడానికి నేను చాలా భయపడ్డాను. కాస్త బిడియంగా అనిపించింది. ఓ దశలో పారిపోవాలనిపించింది’’అని షారుక్‌ ఖాన్‌ వెల్లడించారు. 

హీరోయిన్‌‌ కియారా అద్వాణి బేబీ బంప్‌‌తో బ్లూ కార్పెట్‌‌పై కనువిందు చేసింది. ఇక తన భర్త నిక్‌‌ జోనాస్‌‌తో కలిసి ప్రియాంక చోప్రా ట్రెండీ కాస్ట్యూమ్స్‌‌లో మెరిసింది. మహారాజా గెటప్‌‌లో సింగర్‌‌‌‌ దిల్జిత్‌‌ దోసాంజ్, ఇండియన్‌‌ టెక్స్‌‌టైల్‌‌ లెగసీని చాటే కాస్ట్యూమ్స్‌‌లో ఈషా అంబానీ ఆకట్టుకున్నారు.