సైన్స్‌కు, అగ్ని పురాణానికి మధ్య భీకర యుద్ధం.. 'శంబాల' ట్రైలర్ హైప్ మామూలుగా లేదుగా!

సైన్స్‌కు, అగ్ని పురాణానికి మధ్య భీకర యుద్ధం.. 'శంబాల' ట్రైలర్ హైప్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ 'శంబాల: ఏ మిస్టికల్‌ వరల్డ్‌'.  భారీ బడ్జెట్ తో, విభిన్న కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నారు. డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ఈ  చిత్రం ట్రైలర్ ను  రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది.

సాయికుమార్ గంభీరమైన వాయిస్‌తో మొదలైన ట్రైలర్, పురాణ కాలంలో శివుడికి, శక్తివంతమైన అసురుడికి మధ్య జరిగిన భయంకరమైన యుద్ధం నేపథ్యాన్ని పరిచయం చేస్తుంది. ఆ యుద్ధం కారణంగా శివుడి చెమట భూమిపై పడి ఒక వింత దివ్య దృగ్విషయానికి దారితీసిందని, అది అగ్ని పురాణం ప్రకారం చీకటి శక్తులను మేల్కొల్పిందని తెలుస్తోందంటూ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

ALSO READ : ఎట్టకేలకు నా ప్రేయసితో నిశ్చితార్థం..

ఈ కథనం 1980ల నాటి వాతావరణంలో, ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో జరుగుతున్న అంతుచిక్కని హత్యలు, అతీంద్రియ సంఘటనలను పరిశోధించడానికి జియో-సైంటిస్ట్ విక్రమ్‌గా ఆది సాయికుమార్ రంగంలోకి దిగుతాడు. దేవుళ్లు, అద్భుతాలు అంటూ దేనినీ నమ్మని హేతువాది అయిన విక్రమ్‌కు, ఈ మిస్టికల్ శక్తిని ఛేదించడం ఒక పెను సవాల్ మారుతుంది.. లాజిక్‌కు, మర్మమైన శక్తులకు మధ్య జరిగే ఈ భీకర పోరాటమే సినిమా కథాంశం.

దర్శకుడు యుగంధర్‌ ముని ఈ చిత్రాన్ని గతంలో ఎప్పుడూ భారతీయ తెరపై చూపించని పాయింట్‌తో, అద్భుతమైన విజువల్స్‌తో తీర్చిదిద్దారు. ఆది సాయికుమార్ జియో-సైంటిస్ట్‌గా సరికొత్త అవతార్‌లో ఆకట్టుకున్నారు. అర్చన అయ్యర్‌ కథానాయికగా నటించగా, స్వాసిక , రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠను పెంచింది. రాజశేఖర్‌ అన్నభీమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు విజువల్ వండర్‌ను అందిస్తుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. డిసెంబర్ 25న ఈ మిస్టికల్ వరల్డ్‌ను థియేటర్లలో చూడటానికి ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..