శామీర్ పేట్ సెలబ్రిటీ రిసార్ట్ లో జరిగిన కాల్పుల్లో కీలక విషయాలు బయటకొచ్చాయి. వైజాగ్ లోని హిందూజా థర్మల్ పవర్ లో మేనేజర్ గా పనిచేస్తున్న సిద్ధార్థ్ దాస్..తన భార్య స్మితతో విభేదాల కారణంగా 2019 నుంచి విడిగా ఉంటున్నారు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
సిద్ధార్థ్ దాస్ తో విడిపోయిన తర్వాత స్మిత, మనోజ్ అనే సీరియల్ నటుడితో సహజీవనం చేస్తోంది. గత మూడేళ్ళుగా సెలబ్రిటీ రిసార్ట్ లోని విల్లాలో స్మిత మనోజ్ తో కలిసి ఉంటుంది. సిద్ధార్ట్ నుంచి విడాకులు కావాలని స్మిత 2019 లో కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్ట్ లో అప్లై చేసిందని మేడ్చల్ డీసీపీ సందీప్ తెలిపారు. మనోజ్ కి సాఫ్ట్ వేర్ కంపెనీ ఉందని సమాచారం.
అయితే మనోజ్ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ స్మిత పిల్లలిద్దరు ఈ నెలలో సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని తండ్రి సిద్ధార్థ్ కు చెప్పారు. దీంతో పిల్లల కోసం ఇవాళ(జూలై 15) విశాఖ నుంచి సిద్దార్థ్ శామీర్ పేటలోని మనోజ్ విల్లాకు వచ్చాడు. సిద్ధార్థ్ విల్లాలో ముగ్గురు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే మనోజ్ ఎయిర్ గన్ తో సిద్ధార్థ్ పై కాల్పులు జరిపాడని పోలీసులు చెప్పారు.