ఐపీఎల్ మ్యాచ్​పై ఆన్​లైన్ బెట్టింగ్..ఏడుగురు అరెస్ట్

ఐపీఎల్ మ్యాచ్​పై ఆన్​లైన్ బెట్టింగ్..ఏడుగురు అరెస్ట్
  • ఐపీఎల్ మ్యాచ్​పై ఆన్​లైన్ బెట్టింగ్
  • ఏడుగురు అరెస్ట్.. 
  •  రూ. లక్షా 12 వేల క్యాష్ సీజ్

షాద్​నగర్, వెలుగు : ఐపీఎల్ మ్యాచ్​లపై ఆన్​లైన్ బెట్టింగ్​లకు పాల్పడుతున్న ఏడుగురిని శంషాబాద్ ఎస్​వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్​నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన సురేశ్ స్థానిక యువకులతో కలిసి ఐపీఎల్ మ్యాచ్​లపై ఆన్​లైన్ బెట్టింగ్​ను మొదలుపెట్టాడు. సురేశ్ శనివారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్​పై ఆన్​ లైన్ బెట్టింగ్ నిర్వహించాడు.

పరిగి రోడ్​లోని ఓ టీ స్టాల్ వద్ద ఈ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుసుకున్న శంషాబాద్ ఎస్​వోటీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సురేశ్​తో పాటు ఫరూఖ్​నగర్​కు చెందిన షబ్బీర్, అయ్యప్ప కాలనీకి చెందిన యాదగిరి, ఇంద్రానగర్​కు చెందిన గణేశ్, జంగయ్య, రమేశ్, కిశోర్ సహా మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. లక్షా 12 వేల 950 క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను షాద్​నగర్ పోలీసులకు అప్పగించారు.