
ముస్లింలకు వ్యతిరేకంగా సోషల్ మీడయాలో పోస్ట్ చేసిన కేసులో అరెస్ట్ అయిన సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ షమిష్ట పనోలికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. కలకత్తా హైకోర్టు గురువారం (జూన్ 5) పనోలికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పదివేల బెయిల్ బాండ్ సమర్పించాలని ఆదేశించింది. రెండు వైపులా వాదనలు విన్న జస్టిస్ రాజాబసు చౌదరి.. పనోలికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పనోలి తరపున సీనియర్ లాయర్లు డీపీ సింగ్, నీలంజన్ భట్టాఛార్జీ, రాజ్ దీప మజుందార్ వాదించారు.
సోషల్ మీడియా ప్రభావశీలి శర్మిష్ఠ పనోలి మధ్యంతర బెయిల్ పిటిషన్ను కలకత్తా హైకోర్టు జూన్ 3న తిరస్కరించింది. పిటిషనర్కు తగిన పోలీసు రక్షణ కల్పించాలని కోర్టు తెలిపింది. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి వజాహత్ ఖాన్ ఖాద్రీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కోల్ కతా పోలీసులు. ఈ వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా సోషల్ మీడియా ప్రభావశీలి శర్మిష్ఠ పనోలి అరెస్టు అయ్యారని ఆరోపించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వజాహత్ ఖాన్ ఖాద్రీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసే లక్ష్యంతో సోషల్ మీడియాలో దుర్మార్గపు,రెచ్చగొట్టే" కంటెంట్ను అప్లోడ్ చేశాడని పోలీసులు అతనిపై అభియోగం మోపారు. శ్రీ రామ్ స్వాభిమాన్ పరిషత్ కోల్కతాలోని గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్లో వజాహత్ ఖాన్ ఖాద్రీపై ఫిర్యాదు చేసింది.
శర్మిష్ట అరెస్టు గురించి..
ఆన్లైన్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించిన మతపరమైన వీడియోను షేర్ చేశారనే ఆరోపణలతో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలిని హర్యానాలోని గురుగ్రామ్లో కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు.కోల్కతాలోని అలీపోర్ కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.ఆ వీడియోలో ఆమె బాలీవుడ్ ప్రముఖులు ఆపరేషన్ సిందూర్పై మౌనంగా ఉండటం పట్ల విమర్శించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో తీవ్రమైన ట్రోలింగ్ ,బెదిరింపులు పనోలీ ఎదుర్కొంది. పనోలి ఆ వీడియోను తొలగించి మే 15న బహిరంగ క్షమాపణలు చెప్పారు.