లా మినిస్ట్రీ ఆఫీసర్‌‌కు కరోనా పాజిటివ్‌

లా మినిస్ట్రీ ఆఫీసర్‌‌కు కరోనా పాజిటివ్‌
  • శాస్త్రీ భవన్‌ ఫోర్త్‌ ఫ్లోర్‌‌ సీజ్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలోని శాస్త్రీ భవన్‌ను అధికారులు పాక్షికంగా మూసేశారు. లా మినిస్ట్రీ ఆఫీసర్‌‌ ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో నాలుగో ఫ్లోర్‌‌ను మూసేసినట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఏప్రిల్‌ 23న డ్యూటీకి వచ్చాడని, ఆ తర్వాత నుంచి సెలవులో ఉన్నారని అన్నాడు. దీంతో ఆఫీసర్లు ఉపయోగించే గేట్‌ నంబర్‌‌ 1, 2ను బుధవారం వరకు క్లోజ్‌ చేస్తున్నామని ప్రకటించారు. శానిటైజేషన్‌ స్టార్ట్‌ మొదలు పెట్టామని, హెల్త్‌ ప్రొటోకాల్‌ ప్రకారం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటికే బీఎస్‌ఎఫ్‌ హెడ్‌క్వార్టర్స్‌, నీతి ఆయోగ్‌ భవన్‌ మూసేసిన విషయం తెలిసిందే.