- పబ్లిక్ ప్లేసెస్లో న్యూసెన్స్ చేస్తుండగా షీ టీమ్స్ వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: పబ్లిక్ ప్లేసెస్లో అసభ్యంగా ప్రవర్తించిన ప్రేమ జంటలకు షీ టీమ్స్ జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రేమజంటలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రజల నుంచి కంప్లైంట్స్ రావడంతో షీ టీమ్స్ రంగంలోకి దిగింది. అలాంటి వారిని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించింది.
పార్కులు, బస్టాండ్లు, బస్సులు, రైల్వే స్టేషన్లు, రోడ్ల మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్న 12 మంది ప్రేమికులను గుర్తించి వీడియోల్లో రికార్డు చేసింది. ఆయా జంటలపై 70(బీ)290 ఐపీసీ 188 సీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రూ. 1,250 ఫైన్ విధించింది.
