దత్తపుత్రుడి కోసం తల్లి న్యాయ పోరాటం

దత్తపుత్రుడి కోసం తల్లి న్యాయ పోరాటం

హైదరాబాద్ : దత్తత తీసుకున్న బాబు కోసం న్యాయపోరాటం చేస్తుందో తల్లి. పటాన్ చెరుకు చెందిన రాజేష్, రమణమ్మకు సంతానం లేకపోవటంతో శారదా అనే మహిళ దగ్గర అఖిల్ ను 14 ఏళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. శారదా అనే మహిళ కొండల్ రావు అనే వ్యక్తితో సహజీవనం చేసింది. పెళ్లి కాకముందే బాబు పుట్టడంతో.. ఆ బాబును వదిలించుకునేందుకు రాజేష్, రమణమ్మ దంపతులకు పెద్దల సమక్షంలో దత్తత ఇచ్చారు. కొంతకాలం తర్వాత శారదా, కొండల్ రావు పెళ్లి చేసుకున్నారు. అయితే 14 సంవత్సరాల తర్వాత తన బాబును తనకు ఇవ్వాలని బాబును పెంచిన తల్లిదండ్రులను అడిగింది శారద. దీనికి వారు నిరాకరించటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పెంచిన తల్లి రమణమ్మ న్యాయపోరాటం చేస్తోంది. బాబు కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది.