హైదరాబాద్లో డార్క్స్టోర్లు తెరుస్తం: ప్రకటించిన షిప్ రాకెట్

హైదరాబాద్లో డార్క్స్టోర్లు తెరుస్తం: ప్రకటించిన షిప్ రాకెట్

న్యూఢిల్లీ: కస్టమర్లకు వేగంగా డెలివరీలు అందించడానికి హైదరాబాద్​తోపాటు మరో మూడు నగరాల్లో ఆరు నెలల్లోపు డార్క్​ స్టోర్లు తెరుస్తామని లాజిస్టిక్​సేవల కంపెనీ షిప్​ రాకెట్​ ప్రకటించింది. ఎంఎస్​ఎంఈల కోసం హైదరాబాద్​లో షిప్​ రాకెట్​యాత్ర నిర్వహించిన సందర్భంగా కంపెనీ సీఈఓ (షిప్పింగ్) అతుల్​ మెహతా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. 

ఇది వరకే ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో డార్క్​ స్టోర్లు ఉన్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా డెలివరీల కోసం 32 గోదాములు నిర్వహిస్తున్నామని, హైదరాబాద్​లోనూ ఒక గోదాము ఉందని అన్నారు. ఢిల్లీలో డ్రోన్ల ద్వారా వస్తువులను డెలివరీ చేస్తున్నట్టు చెప్పారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో మేం 18 వేల సెల్లర్లకు లాజిస్టిక్ ​సర్వీసులు అందిస్తున్నాం. రెండు కోట్లకు పైగా షిప్​మెంట్లు సాధించాం.  220కిపైగా దేశాలకు పార్సిల్స్​ పంపుతున్నాం. త్వరలో ఐపీఓకు వస్తాం”అని ఆయన వివరించారు.