
న్యూఢిల్లీ: కస్టమర్లకు వేగంగా డెలివరీలు అందించడానికి హైదరాబాద్తోపాటు మరో మూడు నగరాల్లో ఆరు నెలల్లోపు డార్క్ స్టోర్లు తెరుస్తామని లాజిస్టిక్సేవల కంపెనీ షిప్ రాకెట్ ప్రకటించింది. ఎంఎస్ఎంఈల కోసం హైదరాబాద్లో షిప్ రాకెట్యాత్ర నిర్వహించిన సందర్భంగా కంపెనీ సీఈఓ (షిప్పింగ్) అతుల్ మెహతా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.
ఇది వరకే ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో డార్క్ స్టోర్లు ఉన్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా డెలివరీల కోసం 32 గోదాములు నిర్వహిస్తున్నామని, హైదరాబాద్లోనూ ఒక గోదాము ఉందని అన్నారు. ఢిల్లీలో డ్రోన్ల ద్వారా వస్తువులను డెలివరీ చేస్తున్నట్టు చెప్పారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో మేం 18 వేల సెల్లర్లకు లాజిస్టిక్ సర్వీసులు అందిస్తున్నాం. రెండు కోట్లకు పైగా షిప్మెంట్లు సాధించాం. 220కిపైగా దేశాలకు పార్సిల్స్ పంపుతున్నాం. త్వరలో ఐపీఓకు వస్తాం”అని ఆయన వివరించారు.