ముంబై: ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు అందుకున్న సంజయ్ రౌత్కు నా అభినందనలు’.. అంటూ మహారాష్ట్ర ఎంపీ, ఏక్నాథ్ షిండే కొడుకు శ్రీకాంత్ షిండే సోమవారం ఎద్దేవా చేశారు. పత్రా చావల్ ల్యాండ్ స్కామ్ కేసులో విచారణకు రావాలంటూ సంజయ్కు ఈడీ సమన్లు పంపింది. దీనిపై శ్రీకాంత్ సోమవారం స్పందించారు. కాగా, తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైనా శ్రీకాంత్ షిండే మండిపడ్డారు. ఆలోచించి మాట్లాడాలని సూచించారు.