- ఈ నెల15 దాకా సెలవులు పొడిగించిన సర్కారు
- సింగిల్ డిజిట్కు చేరిన టెంపరేచర్లు
- సఫ్దర్జంగ్లో 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత
- సిటీని కమ్మేస్తున్న పొగమంచు.. ఇబ్బందులు పడుతున్న జనం
న్యూఢిల్లీ: చలి తీవ్రత పెరగడంతో ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సర్కారు సెలవులు ప్రకటించింది. టెంపరేచర్లు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో శీతాకాల సెలవులను ఈ నెల 15 దాకా పొడిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఇప్పటికే నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా.. సఫ్దర్ జంగ్ లో ఆదివారం అత్యల్పంగా 1.9 డిగ్రీలుగా నమోదైందని ఇండియన్ మెటిరియోరాలజికల్ డిపార్ట్మెంట్(ఐఎండీ) తెలిపింది. ఆయనగర్లో 2.6, లోధిరోడ్లో2.8, పాలెంలో 5.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. దట్టంగా పొగమంచు పడుతుండటం, చలిగాలులు వీస్తుండటంతో జనాలు బయటికి వచ్చేందుకే జంకుతున్నారు. విజిబిలిటీ 50 మీటర్లకు తగ్గిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో ఎయిర్క్వాలిటీ కూడా తగ్గి వెరీపూర్ కేటగిరీలోకి వెళ్లింది. ఢిల్లీసహా నార్త్లోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆదివారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
జైపూర్ జిల్లాలోనూ స్కూళ్లకు సెలవులు
గాలులు వీస్తుండటంతో ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. యూపీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్లలోని చాలా ప్రాంతాల్లో టెంపరేచర్లు పడిపోతున్నాయి. రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సోమవారం నుంచి ఈ నెల 14 దాకా సెలవులు పొడిగించారు.బరన్ జిల్లాలోనూ ఒకరోజు సెలవు పొడిగించారు.
లక్నో జూలో జంతువుల కోసం హీటర్లు
చలి విపరీతంగా పెరగడంతో ఉత్తరప్రదేశ్లోని లక్నో జూపార్క్లో జంతువుల కోసం హీటర్లు ఏర్పాటు చేశారు. బోన్లకు దుప్పట్లు కప్పారు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు బోన్లలో వెచ్చగా ఉండేందుకు ఎండుగడ్డిని ఉంచారు.