నదిలో దొరికిన 50 కిలోల వెండి శివలింగం

నదిలో దొరికిన 50 కిలోల వెండి శివలింగం

ఉత్తరప్రదేశ్ లోని దోహ్రీఘాట్ పట్టణంలో ఘాగ్రా నదిలో 50 కిలోల వెండి శివలింగం దొరికింది.  బిందెను కడిగేందుకు మట్టి తీస్తున్న రామ్ మిలన్ సాహ్ని అనే వ్యక్తి చేతికి ఈ శివలింగం తాకింది.  ఎంతో బరువుగా ఉండటంతో మరోకరి సహాయంతో ఈ శివలింగాన్ని బయటకు తీశారు రామ్ మిలన్. ఆ తర్వాత ఆ లింగాన్ని గ్రామంలోని ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు, అభిషేకాలు చేశారు. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో ఈ శివలింగాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శివలింగాన్ని స్వాధీనం చేసుకొని  పోలీసు స్టేషన్‌కు తరలించారు .  పూజలు చేసేందుకు కొందరు భక్తులు పోలీసు స్టేషన్‌కు కూడా  చేరుకున్నారు. ఈ శివలింగంపై దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించామని విచారణ అనంతరం శివలింగాన్ని ప్రజలకు అప్పగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.