దీపావళి పండుగని స్వీట్లు కొంటున్న హైదరాబాద్ పబ్లిక్కు షాక్ !

దీపావళి పండుగని స్వీట్లు కొంటున్న హైదరాబాద్ పబ్లిక్కు షాక్ !
  • స్వీట్లలో సింథటిక్​ రంగులు
  • స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీల్లో బట్టబయలు
  • శాంపిల్స్​ సేకరించి ల్యాబ్‌‌‌‌కు పంపిన అధికారులు

హైదరాబాద్, వెలుగు: దీపావళి పండుగను ఆసరాగా చేసుకొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న స్వీట్స్​ తయారీ కేంద్రాలు, షాపులపై ఫుడ్​ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 95 స్వీట్ యూనిట్లలో తనిఖీలు చేపట్టారు. 77 ఎన్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌మెంట్, 157 సర్వైలెన్స్ శాంపిల్స్‌‌‌‌ను సేకరించి ల్యాబ్‌‌‌‌కు పంపారు. కొన్ని చోట్ల ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ వెహికల్స్​ద్వారా స్పాట్ టెస్టింగ్‌‌‌‌లు కూడా నిర్వహించారు. జిలేబీ, లడ్డూ, కోవాలాంటి పదార్థాల్లో ప్రమాదకరమైన సింథటిక్ రంగులు వాడుతున్నట్లు గుర్తించారు.

స్వీట్లపై అలంకరణకు వాడే  సిల్వర్ ఫాయిల్ కూడా నాన్-ఫుడ్ గ్రేడ్ నాణ్యతతో ఉందని, ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని తేల్చారు. చాలా తయారీ కేంద్రాల్లో అపరిశుభ్ర వాతావరణంలో, కల్తీ నెయ్యి, ఒకటికి పదిసార్లు వాడిన నూనెతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. ల్యాబ్ రిపోర్ట్స్​ వచ్చిన తర్వాత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.