
- వెల్లడించిన షాప్సీ
హైదరాబాద్, వెలుగు: పండుగ సీజన్ కోసం ప్రారంభించిన గ్రాండ్ మేళాలో 70 శాతం కంటే ఎక్కువ ఆర్డర్లు, యాప్ ఇన్స్టాల్స్ టైర్ 3, 4 నగరాలు, చిన్న పట్టణాల నుంచే వచ్చాయని ఫ్లిప్కార్ట్కు చెందిన రిటైలర్ షాప్సీ తెలిపింది. తక్కువ ధరలకే వచ్చే నాణ్యమైన ఉత్పత్తులపై వినియోగదారులకు ఆసక్తి పెరుగుతోందని తెలిపింది. తమ కస్టమర్లలో యువతే ఎక్కువగా ఉన్నారని పేర్కొంది.
హోం అప్లయన్సెస్, పురుషుల ఫ్యాషన్, ఫుట్వేర్ విభాగాలలో రికార్డు వృద్ధి నమోదయిందని, రిపీటెడ్బయర్స్ 44 శాతం పెరిగారని తెలిపింది. రూ. 149 - లోపు ధర కలిగిన కోటికి పైగా ఉత్పత్తులను అందిస్తున్నామని వెల్లడించింది. ఈసారి హోం అప్లయన్సెస్లో 108 శాతం, పురుషుల సాధారణ దుస్తులు, ఫుట్వేర్లో 95 శాతం పెరుగుదల కనిపించిందని సంస్థ సీనియర్ఎగ్జిక్యూటివ్ ఒకరు వివరించారు.